హైదరాబాద్ శివారు లోని ములుగులో ఉన్న అటవీ కళాశాల, పరిశోధన సంస్థ FCRI ను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించారు. ముందుగా పైలాన్ ను ఆవిష్కరించి ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క నాటారు. అనంతరం ఆయన కాలేజీ క్యాంపస్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు, ఈటెల రాజేందర్, శ్రీనివాస గౌడ్, నిరంజన్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త, PccF ఆర్ శోభ, FCRI డీన్ చంద్ర శేఖర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, కాలేజ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.