శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొత్త దందాకు తెరలేపింది అటవీ శాఖ. అక్కడ స్పీడ్ లిమిట్ పేరుతో వాహనానికి రూ.500 వరకూ వసూలు చేస్తున్నారు. దోర్నాల చెక్ పోస్ట్ నుంచి శిఖరం దగ్గర చెక్ పోస్ట్ వరకు గల 35 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట (60 నిమిషాలు) లోపు చేరుకుంటే రూ. 500 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ విధంగా ఘాట్ రోడ్డులో యాత్రీకులను నిలువు దోపిడి చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నించిన వారిపై అటవీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వాహనదారులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా స్పీడ్ లిమిట్ పేరుతో పైసలు వసూలు చేస్తున్న సిబ్బంది చర్యలకు పలువురు ఆశ్చర్యపోతున్నారు.
previous post