అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఓబులేసు కొండకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో అగ్నికి కొండ పైనున్న చెట్టుచేమ ఆహుతి అయింది. అగ్నికీలలు చుట్టుపక్కల ప్రాంతాలకు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అక్కడ కూడా చెట్లు కాలి బూడిద అయ్యాయి. కొండకు కింది పక్కన బుక్కపట్నం గ్రామానికి చెందిన పత్తి చలపతి రైతుకు చెందిన చీనీ తోట కు మంటలు వ్యాపించాయి. దీంతో కంచ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అగ్ని కీలలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. సత్వరమే అక్కడికి చేరుకొని చీనీ తోట అగ్నికి ఆహుతి కాకుండా మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
previous post