మంచిర్యాల జిల్లా కుస్నపల్లి రేంజ్ పరిది డుగ్నేపల్లి గ్రామంలో మంచిర్యాల డి ఎఫ్ ఓ ఆదేశాల మేరకు కుశ్నపల్లి రేంజ్ అధికారి గోపి చంద్ సర్దార్, నేన్నెల డిప్యూటీ రేంజ్ అధికారి ఆర్ కల్పన దేవి, అటవీ శాఖ సిబ్బంది గ్రామం లో సామూహిక సోదాలు నిర్వహించగా అటవీ పంది మాంసం లభించింది.
ఆ మాంసాన్ని స్వాధీన పరచుకుని నిందితులు పాగిడి ప్రేమ్ కుమార్, రత్నం లింగయ్య, కలాలి రవి కుమార్, అగొలపు అంజయ్య మాల గుర్జాల నేరస్తులను అరెస్ట్ చేసి బెల్లంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టమని నేన్నేల డిప్యూటీ రేంజ్ అధికారి కల్పన దేవి తెలిపారు. దాడుల్లో ఎఫ్ ఆర్ ఓ గోపీచంద్ సర్దార్, డి ఆర్ ఓ బాబు పటేకర్ ,ఫారెస్ట్ భీ ట్ ఆపిసర్లు రజనీ, షంకర్, అశోక్, తేజ శ్రీ, రాజ శేఖర్ పాల్గొన్నారు.