తన లెటర్ పాడ్ పై ఫోర్జరీ సంతకం చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని.. భారతీయ జనతాపార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదును స్వీకరించిన సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాగా ఈసీకి వరద సహాయం ఆపేయాలంటూ తాను లేఖరాసినట్లు రాద్దాంతం చేసిన విషయం విదితమే. ఈ విషయంపై టీఆర్ఎస్ నేతలు కూడా ఓ మెట్టేక్కి మరీ ఆరోపణల్లో వేగం పెంచారు. ఈ నేపథ్యం బండి సంజయ్కు టీఆర్ఎస్ నేతలకు మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు తలెత్తాయి.