కృష్ణ జిల్లా (అవనిగడ్డ)లో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ భరించలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడడంతో రైతుకుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం చింతలమడలో సూదాని సాంబశివరావు కౌలుకుపోలాన్ని చేసుకుంటున్నాడు. కాగా ఇటీవల వర్షాల నేపథ్యంలో వేసిన పంట చేతికి రాకపోగా పంట కోసం చేసిన అప్పుల బాధలు ఎక్కువయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతు సూదాని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటీన సూదానిని మచిలీపట్నంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కాగా ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
previous post