భారతదేశంలో “కాంట్రాక్ట్ ఫార్మింగ్” కొత్త కాదని, హిందూస్థాన్ లీవర్ లిమిటెడ్, ఐటీసీ, పెప్సీకో, రాల్లీస్ వంటి కార్పొరేట్ సంస్థలు 20ఏళ్ల క్రితం నుండే రైతులతో ఒప్పందాలు చేసుకొని “కాంట్రాక్ట్ ఫార్మింగ్” చేస్తున్నాయని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ప్రముఖ వ్యవసాయవేత్త జేడీ. లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ విధానం వలన రైతులకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలు,శక్తులు నూతన వ్యవసాయ చట్టాల గురుంచి లేనిపోని అపోహలు సృష్టించి, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాల వలన దేశంలోని రైతులకు ఎనలేని మేలు జరుగుతుందన్నారు. ఒకవేళ రైతులు, కార్పొరేట్స్ మధ్య డిస్ప్యూట్స్ వచ్చినా తక్షణమే పరిష్కరించుకునే రాజ్యాంగబద్ద రక్షణ, ప్రభుత్వ భరోసా నూతన వ్యవసాయ చట్టాలు కల్పిస్తున్నాయని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
previous post