రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఈరోజు చీరాల నగర్ -2 (చీరాల దండు రహదారి) లో మెగా గ్రౌండింగ్ మేళ జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరై చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ఇళ్లకు శంకుస్థాపన చేశారు. నవరత్నాలు లో భాగంగా పేదలందరికీ ఇల్లు కోసం చీరాలలో 471 గృహాలు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగ మల్లేశ్వర రావు, ఎమ్మార్వో హుస్సేన్, ఎంపిడిఓ సాంబశివరావు, గృహ నిర్మాణ శాఖ అధికారులు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.