27.7 C
Hyderabad
April 25, 2024 10: 37 AM
Slider హైదరాబాద్

అంబర్ పేట్ లో నూతన డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

అంబర్ పేట డివిజన్ నరేంద్ర నగర్ లో సుమారుగా 7 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతన డ్రైనేజ్ నిర్మాణ పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర నగర్ లో పర్యటించారు. అనంతరం వారు మాట్లాడుతూ నరేంద్ర నగర్ లో డ్రైనేజ్ లైన్ లేకపోవడం, కచ్చ మోరి లైన్ ఉండడంతో స్థానిక ప్రజలకు విపరీతమైన దుర్వాసనతో ఇబ్బంది పడుతుండడం, కలుషిత మంచినీరు రావడం జరుగుతున్నాయి అందువల్ల కచ్చా మోరి లైన్స్ ని తొలగించి వాటి స్థానంలో నూతన డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నరేంద్ర నగర్ లో ఉన్నటువంటి మిగతా అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబర్ పేట నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో నూతన డ్రైనేజ్ లైన్లు వేయడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కార్పొరేటర్ గా నేను గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సహకారంతో అంబర్ పేట డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. నరేంద్ర నగర్లో నూతన డ్రైనేజ్ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఈ కుషాల్, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, స్థానిక బస్తీ ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

కర్నాటక నుంచి తెలంగాణకు వస్తున్న డూప్లికేట్ గుట్కా

Satyam NEWS

నేరం జరిగిన ప్రాంతానికి పోలీసులు తక్షణమే చేరాలి

Satyam NEWS

పేద‌ల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది: రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

Satyam NEWS

Leave a Comment