కామారెడ్డి జిల్లా మద్దూనుర్ మండలంలోని సల్బతాపూర్ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం ఏర్పాటుకు జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 6కోట్ల 70లక్షలతో నిర్మాణం చేపట్టనున్న కల్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయంను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామిరెడ్డి, మద్దునూరు ఎంపిపి లక్ష్మీబాయి, గ్రామ సర్పంచ్ గఫార్, డిసిసిబి డైరెక్టర్ రామ్ పాటిల్, తెరాస అధ్యక్షులు సంగమేశ్వర్ పాల్గొన్నారు.
ఇంకా, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సురేష్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ ,ఎంపీటీసీ విజయ్, మదునురు ఎంపీటీసీ సంగీత కుశాల్ ,ఆలయ కమిటీ చైర్మన్ నర్సింలు గౌడ్, మండల నాయకులు అశోక్ పటేల్, బాబు పాటీల్ ,బనిషి పటేల్ ,మండల సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు ఉన్నారు.