Slider నిజామాబాద్

సల్బతాపూర్ ఆలయంలో కల్యాణ మండపం

#Kalyanamandapam

కామారెడ్డి జిల్లా మద్దూనుర్ మండలంలోని సల్బతాపూర్ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం ఏర్పాటుకు జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో  6కోట్ల 70లక్షలతో నిర్మాణం చేపట్టనున్న కల్యాణ మండపానికి  శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయంను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామిరెడ్డి, మద్దునూరు ఎంపిపి లక్ష్మీబాయి, గ్రామ సర్పంచ్ గఫార్, డిసిసిబి డైరెక్టర్ రామ్ పాటిల్, తెరాస అధ్యక్షులు సంగమేశ్వర్ పాల్గొన్నారు.

ఇంకా, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సురేష్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ ,ఎంపీటీసీ విజయ్, మదునురు ఎంపీటీసీ సంగీత కుశాల్ ,ఆలయ కమిటీ చైర్మన్ నర్సింలు గౌడ్, మండల నాయకులు అశోక్  పటేల్, బాబు పాటీల్ ,బనిషి పటేల్ ,మండల సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Related posts

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు నమోదు చేసుకోండి

Satyam NEWS

అక్రమ సంబంధం తో యువ జంట ఆత్మహత్య

Satyam NEWS

ఈ.వీ.ఎం. గిడ్డంగులు త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!