ఉప్పల్ నియోజకవర్గంలోని కైలాసగిరి చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ , బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ల ప్రతిష్ట కు నేడు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గోల్లూరి అంజయ్య లు హాజరయ్యారు. భూమి పూజ చేసిన అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ హాజరైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు పోలేపాక అంజయ్య బిజెపి రాష్ట్ర నాయకులు బంగి లక్ష్మణ్ కైలాసగిరి కాలనీ ప్రెసిడెంట్ జంగా బాలరాజ్ వైస్ ప్రెసిడెంట్ బాల్ నరసింహ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కోశాధికారి జోగుశీను సహాయ కార్యదర్శి జయరాజ్ మరియు కైలాసగిరి మాజీ ప్రెసిడెంట్ లు ప్రధాన కార్యదర్శులు రాజీవ్ నగర్ నవోదయ నగర్ ప్రెసిడెంట్ లు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. కైలాసగిరి రాజీవ్ నగర్ నవోదయ నగర్ కాలనీ పెద్దలు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి