28.7 C
Hyderabad
April 20, 2024 08: 32 AM
Slider రంగారెడ్డి

శేరిలింగంపల్లిలో శ్రీ అభయ వీరంజనేయ స్వామి ఆలయానికి శంఖుస్థాపన

#sherilingampally

శేరిలింగంపల్లిలో శ్రీ అభయ వీరంజనేయ స్వామి ఆలయానికి నేడు వైభవంగా శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీలో నూతనంగా ఈ ఆలయాన్ని నిర్మించతలపెట్టారు. శ్రీ అభయ వీరంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణ శంఖుస్థాపన సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి, పూజా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, రాజుపటేల్, రాములు గౌడ్, భిక్షపతి, గంగాధర్ గణేష్, శంకర్ రావు, కృష్ణారావు, నాగేష్, దిలీప్ కుమార్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సాయం కోరిన మహిళ: స్పందించిన కలెక్టర్ హిమాన్సు శుక్లా

Satyam NEWS

మెట్రో నగరాలకు ధీటుగా ఖమ్మం

Bhavani

ఎస్ సి, ఎస్ టి యువతకు ఎంఎస్ఎంఇ శిక్షణ

Satyam NEWS

Leave a Comment