శేరిలింగంపల్లిలో శ్రీ అభయ వీరంజనేయ స్వామి ఆలయానికి నేడు వైభవంగా శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీలో నూతనంగా ఈ ఆలయాన్ని నిర్మించతలపెట్టారు. శ్రీ అభయ వీరంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణ శంఖుస్థాపన సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి, పూజా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, రాజుపటేల్, రాములు గౌడ్, భిక్షపతి, గంగాధర్ గణేష్, శంకర్ రావు, కృష్ణారావు, నాగేష్, దిలీప్ కుమార్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
previous post