ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం దగ్గరలో లారీ ఢీకొని కారు దగ్ధం అయింది. ఆ కారు లో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వారంతా పూర్తిగా సజీవదహనం అయ్యారని సమాచారం.
విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి గ్రామీణ ఎస్సై సుమన్ చేరుకున్నారు. అక్కడ నుంచి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు.
జరిగిన సంఘటనపై పోలీస్ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన తెలుసుకున్న వెంటనే స్థలానికి చేరుకున్న డిఎస్పి కిషోర్ కుమార్ చేరుకున్నారు.