ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి అతి చేరువలో ఉన్న ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్ పేట లో నేడు మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నాలుగు కేసులు కూడా సీఎం నివాసానికి అతి చేరువలో రావడం వలన ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
కాగా ఇందులో ఇద్దరు వాలంటీర్లు ఉండటంతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాలంటీర్లు ఇద్దరు గత మూడు రోజుల క్రితం తాడేపల్లి లో గల ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. అధికారులు తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల శానిటేషన్ పనులను చేస్తున్నారు.