40.2 C
Hyderabad
April 19, 2024 18: 27 PM
Slider అనంతపురం

అనంతపురం జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

#RoadAccident

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి లోని కియా కార్ల తయారీ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.

ఒక కారు ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారు బెంగుళూరు వైపు నుంచి హైదరాబాద్ కు వెళుతున్నది.

జాతీయ రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ముందు వాహనం స్లో అయింది. దాంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు దాన్ని ఢీ కొట్టింది.

ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మనోజ్ విట్టల్, అతనితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో రేఖ(21)కిషన్ గంజ్ నార్త్ దిల్లీ, ఆంచల్ సింగ్(21), మహబూబ్ఆలం(31)ఆర్.టీ.నగర్ నార్త్ బెంగళూరు, మనోజ్ మిట్టల్ (38)ప్లాటినం సిటీ నార్త్ బెంగళూరు మరణించారు.

Related posts

శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి పర్వదినానికి ఏర్పాట్లు

Satyam NEWS

స్వామివారి వెండి కిరీటం మాయం వాస్తవమే

Satyam NEWS

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు సీజ్

Satyam NEWS

Leave a Comment