విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
అగ్నిప్రమాదంలో చనిపోయారని కొందరు చెబుతున్నారు. అయితే చుట్టూ రక్తపు మరకలు ఉండటంతో అనుమానం వ్యక్తమవుతోంది.
మధురవాడ మిధిలపురి కాలనీలోని ఆదిత్య టవర్స్ లో ఈ ఘటన జరిగింది. మరణించిన వారిని బంగారు నాయుడు(50), నిర్మల(46), దీపక్(22), కశ్యప్ (19) గా గుర్తించారు.
వీరంతా ఎన్ ఆర్ ఐ లు. 8 నెలల కిందట వీరంతా ఈ అపార్ట్ మెంట్ లోకి వచ్చారు. అపార్ట్ మెంట్ 5వ అంతస్తులో ఉన్న వీరు అనుమానాస్పద స్థితిలో మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.