39.2 C
Hyderabad
April 25, 2024 17: 06 PM
Slider కడప

విహారయాత్రలో విషాదం: నలుగురు గల్లంతు

#kadapa

కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు సమీపానున్న గండిమడుగు చెరువు వద్దకు శనివారం విహారయాత్రకు వెళ్లిన కుటుంబ సభ్యుల బృందం చెరువులో ఈదులాడుతూ నలుగురు గల్లంతు అయ్యారు.

గల్లంతు అయిన వారిలో తాజ్(40), మహమ్మద్ (11), ఉస్మాన్ ఖాన్(12), మహమ్మద్ ఫాహద్(10) ఉన్నారు. వీరిని కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు చెందిన వారిగా గుర్తించారు.

వాయల్పాడు కు బంధువుల ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో గండిమడుగు చెరువు వద్దకు వెళ్ళిన ఈ నలుగురు నీటిలో గల్లంతు అయ్యారు.

ఈదులాడుతూ చెరువులో మునిగి నలుగురు గల్లంతు అయినట్లు పోలీసులు తెలిపారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

రఘురామతో సయోధ్యకు నలుగురు ఎంపిల రాయబారం?

Satyam NEWS

నాన్ బెయిలబుల్ అఫెన్స్: గల్లా అరెస్టుపై పోలీసుల వివరణ

Satyam NEWS

ఊకచెట్టు వాగుపై వెంటనే వంతెన నిర్మించాలి

Satyam NEWS

Leave a Comment