ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కోర్టు ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేపాయి. కోర్టులోని రూమ్ నెంబర్ 207లో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఘటనలో గ్యాంగ్స్టార్ జితేంద్ర గోగితోపాటు మరో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
రెండు గ్యాంగ్ల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టుకు వచ్చిన జితేంద్ర టార్గెట్గానే ఈ కాల్పులు జరిగాయని భావిస్తున్నారు. లాయర్ల ముసుగులో ఉన్న జితేంద్ర ప్రత్యర్థులు.. అతడిపై కాల్పులకు తెగబడ్డారు. 30 ఏళ్ల జితేంద్ర గోగి గత ఏప్రిల్లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ ఎంసీవో సీఏ కింద అరెస్టయ్యాడు. హత్యలు, హత్యాయత్నం సహా మొత్తం జితేంద్రపై 19 కేసులు ఉన్నాయి.
కాల్పులకు పాల్పడిన వారిని టిల్లు తాజ్ పూరియా గ్యాంగ్ సభ్యులుగా అనుమానిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం జితేందర్గోగి తిహాడ్ జైల్లో ఉన్నారు. తాజాగా విచారణలో భాగంగా జితేందర్ గోగిని రోహిణి కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ఈ దాడి జరిగింది. గతంలో ఆయనపై ఢిల్లీ పోలీసులు రూ.6లక్షల రివార్డు కూడా ప్రకటించారు.