ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అందరికి ఉచితంగా ఇచ్చేస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనను తలదన్నేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు.
తనను ఎన్నుకుంటే అన్నీ ఫ్రీ అంటూ హామీ గుప్పించేశాడు. అలా హామీ ఇవ్వడమే కాదు… ఈ మేరకు స్టాంప్ పేపర్ పై రాసి సంతకాలు కూడా చేసేశాడు.
ఈ ‘‘అత్యంత ఖరీదైన హామీ’’ ఎపిసోడ్ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో జరిగింది. అక్కడ మూడవ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న పడాల రంగారెడ్డి తమ వర్గాన్ని గెలిపిస్తే
అయిదు హామీలంటూ హామీ పత్రం రాసిచ్చాడు. సంవత్సర కాలం పాటు కేబుల్ ప్రసారాలు, రేషన్, మినరల్ వాటర్ ఉచితమని, బీపీ షుగర్ పరీక్షలు ఉచితంగా, ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు పది మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పన ఇస్తామని హామీ ఇచ్చాడు.
ఇలా హామీ ఇవ్వడంతో పాటు వీటిని రూ.20 బాండ్పై ముద్రించి నోటరీ చేయించి 14 బాండ్లను చేయించి 14 వార్డుల్లోని పెద్దలకు అందించాడు. ఈ హామీ పత్రాన్ని నోటరీ చేయించాడు.
అయితే ఈ హామీలన్నీ ఏ నిధులతో చేస్తాడో చెప్పలేదు. సొంత డబ్బులా? పంచాయితీ డబ్బులా? ఎక్కడినుంచి అయినా కొట్టుకొచ్చి ఇస్తాడా????