27.7 C
Hyderabad
April 26, 2024 03: 10 AM
Slider నెల్లూరు

వెంకటగిరి ప్రజలకు ఉచితంగా కృష్ణపట్నం ఆనందయ్య మందు

#venkatagiri

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజక వర్గంలోని ప్రతి ఇంటికి కరోనా నివారణ మందును అందచేసేందుకు కృష్ణపట్నం ఆనందయ్య ను కోరినట్లు హరిత ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బండి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

రాపూరు మాజీ ఎంపీపీ, దివంగత నేత బండి కృష్ణా రెడ్డి కుమారుడు అయిన వేణుగోపాల్ రెడ్డి చాలా కాలంగా సమాజ సేవ చేస్తున్నారు.

అందులో భాగంగా ఆయన మంగళవారం నాడు ఆనందయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా వెంకటగిరి నియోజక వర్గంలోని ప్రతి ఇంటికి కరోనా నివారణ మందును అందచేద్దామని ప్రదిపాదించారు.

మందు తయారు చేయడానికి కావలసిన సామగ్రి తదితర అంశాలపై ఆనందయ్య తో ఆయన చర్చించారు. అందుకు ఆనందయ్య సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు.

తన తండ్రి బండి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం 50 లక్షలు ఖర్చు చేసైనా వెంకటగిరి నియోజకవర్గం లోని ప్రతి ఇంటికి కృష్ణపట్నం ఆనందయ్య కరోనా నివారణ మందును ఉచితంగా త్వరలో పంపిణీ చేస్తానని తెలిపారు.

Related posts

కేంద్ర మాజీ మంత్రి ని తూర్పారబెట్టిన మంత్రి బొత్స

Satyam NEWS

భారత దేశంలో తెలుగు వారిని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్

Bhavani

ఆవిర్భవించిన 9 మాసాల లోనే అధికారంలోకి వచ్చిన టిడిపి

Satyam NEWS

Leave a Comment