27.2 C
Hyderabad
September 21, 2023 20: 47 PM
Slider ఆంధ్రప్రదేశ్

21వ తేదీన ఉచిత వైద్య ఆరోగ్య, కంటి చికిత్స

NSS Camp

ఉచిత వైద్య ఆరోగ్య, కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేసేందుకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం నిర్ణయించింది. ఈ నెల 21న ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని జాతీయ సేవా పథకం (NSS)జిల్లా సమన్వయకర్త ఏ ఉదయశంకర్ తెలిపారు. ఈ నెల 21న శనివారం ఉదయం 10.00 గం నుండి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల ప్రాంగణంలో ఈ మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి, వైద్య ఆరోగ్య శిబిరము ప్రారంభం కాబోతోందని అవసరమైన వారు శిబిరానికి రావచ్చునని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్.సుదర్శన రావు ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం  పరిధిలో ఉన్న ప్రతి NSS యూనిట్ నుంచి  NSS వాలంటీర్లు కచ్చితంగా ఈ కార్యక్రమంలో  పాల్గొని విజయవంతం చేయాలని కూడా జాతీయ సేవా పథకం (NSS)జిల్లా సమన్వయకర్త ఉదయశంకర్ కోరారు.

Related posts

ఎకరాకు ఒక్క బస్తా యూరియా చాలు

Satyam NEWS

అధికారుల నిర్లక్ష్యంతోనే పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS

ప్రజల్ని మభ్య పెట్టేందుకే పోలవరం సందర్శన డ్రామా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!