వలస కూలీలకు ఇబ్బందులు ఉండకూడదని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో ఎన్నడూ ఎరుగని విధంగా వారికి చేయూత ఇస్తున్నారని రామంతపూర్ కార్పొరేటర్ గంథం జొత్స్నా నాగేశ్వరరావు అన్నారు, ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి మనకు సీఎం కావడం మన అదృష్టమని ఆమె అన్నారు. ఉప్పల్ ప్రాంతంలోని శాంతినగర్ చైతన్య భారతి స్కూల్ లో ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి నగర మేయర్ బొంతు రాంమోహన్, ఎమ్మెల్యే బేతి సుబాష్ రెడ్డి, సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డి.సీ కృష్ణ శేఖర్, ఎం.అర్.ఓ గౌతమ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కార్పొరేటర్ గంథం జొత్స్నానాగేశ్వరావు మాట్లాడుతూ ఇతర రాష్టాలవాళ్ళకి 12 కె.జి ల బియ్యం 500 రూపాయలు నగదు సహాయం చేశామని తెలిపారు.