తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన విధంగా రేషన్ కార్డులేని ఇతర రాష్ట్రాల పేదవారికి ఉచితంగా బియ్యం ఆర్ధిక సాయం చేసే పథకాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నేడు ప్రారంభించారు. యూసుఫ్ గూడాలో 12 కిలోల బియ్యం, 500 రూపాయల ఆర్ధిక సాయం ఆయన ఇతర రాష్ట్రాల పేద వారికి అందించారు.
హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా లోక్ డౌన్ ను పాటించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ కోరారు. లాక్ డౌన్ కారణంగా పని లేక రోజూ భోజనాల కోసం ఇబ్బంది పడుతున్న డెయిలీ లేబర్లకు, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి పనులు చేసుకోవడానికి వచ్చిన వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
అనంతరం బోరబండలో జరిగిన కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేదలకు బియ్యం, ఆర్ధిక సాయం అందచేశారు. జి.ఎచ్.ఎం.సి, రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు బియ్యం అందచేశారు.