కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందచేస్తున్న రేషన్ బియ్యం నేడు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చుక్కాయిపల్లిలో పంపిణీ చేశారు. సామాజిక దూరం పాటించి అందరూ ఈ ఉచిత బియ్యాన్ని అందుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
కరోనా కట్టడికి సంబంధించిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. కరోనా వైరస్ కట్టడికి మరింత అప్రమత్తత అవసరం అని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరారు.
ఇప్పటికే వలస కూలీలను, నిరాశ్రయులను ప్రభుత్వం ఆదుకున్నదాని, కొల్లాపూర్ పట్టణంతో పాటు గ్రామాల్లో కూడా ప్రజలకు ఉచిత రేషన్ సరుకులు అంద చేస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఒకటి రెండు రోజుల్లో వలస కూలీలకు, నిరుపేదలకు ప్రభుత్వం నగదు అందిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్ డి ఓ, ఎం ఆర్ ఓ, మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ చెర్మెన్ విజయలక్ష్మి చంద్రశేఖర్ చారి, వైస్ చెర్మెన్ మహమూద్ బేగం ఖాదర్ పాషా తదితరులు పాల్గొన్నారు.