స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శార్వరి నామ సంవత్సరం మాఘమాస బహుళ విదయ శనివారం ఈ నెల 13 న విజయనగరం కొత్త అగ్రహారం ఎస్.కే.వీ.ఎస్ దేవస్థానంలో ఉచితంగా సామూహిక ఉపనయనములు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు భమిడిపాటి రామ్ కుమార్ శర్మ తెలిపారు.
ఈ బ్రాహ్మణ ఉచిత సామూహిక ఉపనయనంలకు వటువు తల్లి తండ్రి తో పాటు మరో 10 మంది బంధువులకు భోజనాలు ఏర్పాటు చేస్తారు.
అలాగే మరోసారి ఈ తరహాలో జరిపే ఉపనయనములకు, ఉపనయన సామాగ్రి వటువు దీక్షా వస్త్రాలు కూడా ఉచితంగా ఇస్తామని తెలిపారు.
ఈ నెల 13న తెల్లవారుజామున 5 గంటలకు ఉపనయనం ప్రారంభంఅవుతుందని.. ఆ సమయంలోపు అందరూ చేరుకోవాలన్నారు.
ఈ నెల పదో తారీఖు లోపుగా ఫోన్ ద్వారా గాని స్వయంగా వచ్చి అయినా పేర్లను నమోదు చేసుకోవాలని భమిడిపాటి రామశర్మ కోరారు.