పాపం… ఆయన మాత్రం ఏం చేస్తాడు? పాత అలవాటు అంత త్వరగా పోదు కదా? అంటూ సెటైర్లు వేస్తున్నారు ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను చూసి. ఆయనకు ఏమైంది అని ఆలోచిస్తున్నారా? ఆయనకేం కాలేదు కానీ ఆయన ఆయన మాటలు విన్న వాళ్లకే బుర్ర గిర్రున తిరిగింది. గురువారం ఆయన పుట్టిన రోజు. మరింకేం, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన పుట్టిన రోజును ధూధాంగా చేద్దామనుకున్నారు. దీనికి స్థానికంగా ఉన్న వ్యాపారులు కూడా కలిసి వచ్చారు. అట్టహాసంగా సభ మొదలైంది. ఆయనకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. చివరగా మాట్లాడమని ఎమ్మెల్యే చేతికి మైక్ ఇచ్చారు….. ఆయన ఏం మాట్లాడారో వీడియో చూడండి…..
ఆయన మాటలు విని సభికులు ఒక్క సారిగా అవాక్కయ్యారు. టిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడ బోయి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడారు. తామున్నది ఏ పార్టీలోనో అర్ధం కాక సభికులు అవాక్కయ్యారు. పక్కన ఉన్న నాయకులు గుర్తు చేసి సర్దుబాటు చేశారు. ఈ విషయం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వస్తున్నాయి…. జైపాల్ యాదవ్ కారు దిగి సైకిల్ ఎక్కారా?…… పుట్టిన రోజు దావత్ ఫుల్లు గా ఉన్నట్టుంది….. అంటూ పలు కామెంట్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లుతోంది.