సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గంలోని 31 గ్రామాల్లో డి ఎం ఎఫ్ టి ఈ పథకం కింద ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం 2.38 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ఈ మేరకు శనివారం నాడు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీ తెలిపారు. దుబ్బాక మండలం లో 10, మిరుదొడ్డి మండలం లో 11, రాయపోల్ మండలంలో నాలుగు, దౌల్తాబాద్ మండలం లో 03, తొగుట మండలంలో మూడు గ్రామాల్లో మొత్తం 31 గ్రామాలకు ఈ నిధులు మంజూరయ్యాయని MP తెలిపారు.
ఆయా గ్రామాల్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాలు పూర్తి చేయడం, ప్రస్తుతమున్న భవనాలను అక్కడి అవసరాల కోసం అదనపు నిర్మాణాలు చేపట్టడం వంటి పనుల కోసం తాను ఆయా గ్రామాల వారీగా పనుల వివరాలను పేర్కొంటూ, నిధులు మంజూరు కోసం జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపించామన్నారు.
ఈమేరకు జిల్లా మంత్రి ఇ హరీష్ రావు ఈ ప్రతిపాదనలు ఆమోదం తెలుపుతూ నిధులు కేటాయిస్తూ ఆదేశించారు. మంత్రి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శనివారం నాడు ఇందుకు సంబంధించిన నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసినందుకు మంత్రి హరీష్ రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎంపీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.