డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు స్టాండింగ్ కమిటీ మెంబర్, నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేఖర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్
డివిజన్ పరిధిలోని ప్రధాన సమస్యలను కమిషనర్ కు విన్నవించారు. కార్పొరేటర్ డివిజన్లోని పలు అభివృద్ధి నిర్మాణ పనులను పై కమిషనర్ తో చర్చించారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ
- నాచారం రైతు బజార్ లో ఉన్న ఖాళీ స్థలంలో పేద మధ్యతరగతి ప్రజల కొరకు మల్టీ లెవెల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు.
- ఎర్రకుంట లోని హిందూ స్మశాన వాటికను వైకుంఠధామంగా తీర్చిదిద్దాలని
- పటేల్ కుంట చెరువు సుందరీకరించాలని.
- నాచారం వార్డు కార్యాలయం పునర్ నిర్మించాలని వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు