విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ సూర్యనారాయణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ పన్నిన వలలో చిక్కుకున్నారు. 5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.
ములగాడ గ్రామానికి చెందిన నరేష్ కుమార్ పట్నాయక్ తండ్రితో కలిసి గత నెల 30న మోటార్ బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనలో నరేష్ కుమార్ పట్నాయక్ తండ్రి మృతి చెందాడు.
నిందితుడిగా ఉన్న నరేష్ కుమార్ పట్నాయక్ కు 41 ఎ నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిలు మంజూరు చేసేందుకు ఏ ఎస్ ఐ సూర్యనారాయణ 5000 రూపాయలు డిమాండ్ చేయడంతో నరేష్ కుమార్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
దీంతో అధికారులు పథకం ప్రకారం మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలో నరేష్ కుమార్ నుంచి 5000 లంచం తీసుకుంటుండగా ఏ ఎస్ ఐ సూర్యనారాయణ ఏసీబీకి పట్టు బడ్డాడు. కేసు నమోదు చేసి డి.ఎస్.పి రంగరాజు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది