మాజీ కార్పొరేటర్ గంధం జోత్స్నా జన్మదినం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, స్థానిక రామంతపూర్ పూనం భవన్ ఫంక్షన్ హల్ నందు గంథంమ్స్ ఫౌండషన్ ను మాజి మేయర్ బొంతు రాంమోహన్ , కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, స్థానిక నాయకులతో కలిసి ట్రస్ట్ ను ప్రారంబించారు.
ఈ సందర్భంగా జిహెచ్ఎంసి మాజీ మెయర్ బొంతు రామ్మోహన్ మాట్లడుతూ సమాజం లొని పేదలకు, అనాథలకు, వృద్దులకు, దివ్యాoగులకు, పేద విద్యార్థులకు ,రాజకీయాలకు తావులేకుండా మానవత్వంతో ఫౌండేషన్ ను స్థాపించి నిస్వార్థంగా సేవలు అందించడం సంతోషకరమని, మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో గంథం జొత్స్నా మాట్లాడుతూ, ఇప్పటివరకు పలువురు దివ్యంగులకు ఆర్థిక సహయం అందించి స్వయం ఉపాధి కలిపించామన్నారు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పన్నాల దేవెందర్ రెడ్డి, గీతా ప్రవీణ్ ,స్వర్ణరాజ్ , మజి కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య ,హనుమంత్ రెడ్డి స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లా సత్యం న్యూస్