ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రము తెచ్చిన అగ్ర గణ్యుడు మన బోసినవ్వుల బాపూజీ అని తెలంగాణ తెలుగదేశం పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంటు అధ్యక్షులు కందికంటి అశోక్కుమార్గౌడ్, చిలుకానగర్ డివిజన్ అధ్యక్షుడు పబ్బతి శేఖర్రెడ్డి అన్నారు..
జాతిపిత మహాత్మగాంధి 152 వ జయంతి పురస్కరించుకుని ఉప్పల్ డివిజన్లోని మహాత్మగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఉప్పల్ డివజన్ అధ్యక్షుడు తిక్క ప్రకాష్, చిలుకానగర్ డివిజన్ ఇంచార్జి కోళ్ళరవికుమార్గౌడ్, శ్ర్రీనపధాన కార్యదర్శి డా, అశోక్ ,ఉప్పల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బజార్ మస్త్రమంత్గౌడ్, సీనియర్ నాయకలు కీళ్లూరి వేణు, రాములు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.