కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చుక్కాయిపల్లి గ్రామ సేవా సమితి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఈ శ్రీధర్ మహాత్ముడి విగ్రహాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొల్లాపూర్ ఆర్ డి ఓ జి. శ్రీరాములు, కొల్లాపూర్ ఎం ఆర్ ఓ సుదర్శన్ రెడ్డి, కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, మునిసిపల్ చైర్మన్ విజయలక్ష్మి, వైఎస్ చైర్మన్ మహిమూదా బేగం, మార్కెట్ కమిటీ చైర్మన్ గున్ రెడ్డి నరేంద్ర రెడ్డి, గాదెల సుధారాణి, జూపల్లి భాగ్యమ్మ కొల్లాపూర్ సిఐ బి వెంకట్ రెడ్డి, కొల్లాపూర్ ఎస్ ఐ మురళి గౌడ్ తదితరులు విచ్చేస్తారు.
previous post