ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మన బోసి నవ్వుల బాపు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో శనివారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆదెర్ల శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మన బాపు అని,అందుకే ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారని అన్నారు.
సత్యము,అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంతమని,సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు అన్నారు.కొల్లాయి కట్టి,చేత కర్రబట్టి, నూలు వడకి,మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ,కులాలూ ఒకటే అని చాటిన మహానుభావుడు మన గాంధీజీ అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు శాసనాల అంజి,నున్న రామారావు, లింగరాజు, మురళి, కృష్ణ, సైదులు, ఆనెపు బ్రహ్మచారి,తోట కోటి,కందుల నరసింహారెడ్డి,శివ,నర్సి,నవీన్,అక్బర్, నరేందర్ రెడ్డి,శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్