రాయలసీమ లో ప్రఖ్యాత ఆంజనేయ స్వామి ఆలయమైన కడప జిల్లా శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయ మూల విరాట్టు దర్శనం ఈ నెల 27 వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని ఆలయ ఈఓ ముకుందా రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతమున్న దేవాలయం స్థానంలో క్రొత్తగా రాతి శిల్పాలతో నూతన ఆలయం నిర్మిస్తున్నందున బాలాలయం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఆలయ నిర్మాణానికి రు14 కోట్ల మంజూరు చేశారు. ఈనెల 24 నుండి 27 వ తేదీ వరకు హోమములు, యజ్ఞ యాగాదులు పెద్దఎత్తున నిర్స్తారు. 27 వ తేదీ నుండి దేవాలయ నిర్మాణం పూర్తయ్యేంత వరకు మూలవిరాట్టు దర్శనాలు నిలిపివేస్తారు. అందువల్ల మూలవిరాట్టును దర్శించు కోవాలనుకున్న భక్తాదులందరు ఈనెల 27 వ తేదీ లోపల దర్శించుకోవలసిందిగా ఈ ఓ కోరారు.
బాలాలయంలో దారువు విగ్రహ ప్రతిష్ఠ తదుపరి యధావిధిగా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు.