32.7 C
Hyderabad
March 29, 2024 12: 33 PM
Slider ఆధ్యాత్మికం

గండి వీరాంజనేయ స్వామి మూల విరాట్టు దర్శనం ఈ నెల 27 వరకే..!!

#gandiveeranjaneyatemple

రాయలసీమ లో ప్రఖ్యాత ఆంజనేయ స్వామి ఆలయమైన కడప జిల్లా శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయ మూల విరాట్టు దర్శనం ఈ నెల 27 వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని ఆలయ ఈఓ ముకుందా రెడ్డి పేర్కొన్నారు.

ప్రస్తుతమున్న దేవాలయం స్థానంలో క్రొత్తగా రాతి శిల్పాలతో నూతన ఆలయం నిర్మిస్తున్నందున బాలాలయం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఆలయ నిర్మాణానికి రు14 కోట్ల మంజూరు చేశారు. ఈనెల 24 నుండి 27 వ తేదీ వరకు హోమములు, యజ్ఞ యాగాదులు పెద్దఎత్తున నిర్స్తారు. 27 వ తేదీ నుండి  దేవాలయ నిర్మాణం పూర్తయ్యేంత వరకు మూలవిరాట్టు   దర్శనాలు నిలిపివేస్తారు. అందువల్ల మూలవిరాట్టును దర్శించు కోవాలనుకున్న భక్తాదులందరు ఈనెల 27 వ తేదీ లోపల దర్శించుకోవలసిందిగా ఈ ఓ కోరారు.

బాలాలయంలో దారువు విగ్రహ ప్రతిష్ఠ తదుపరి యధావిధిగా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు.

Related posts

సాయిజన్ శేఖర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ లో చేరిన నాయీబ్రాహ్మణలు

Satyam NEWS

స్మశానాలకు ఉచితంగా సుమారు వెయ్యి టన్నుల కలప

Satyam NEWS

ములుగు లైన్స్ క్లబ్ ఆఫ్ సారధ్యంలో ఉచితంగా డిక్షనరీల పంపిణీ

Satyam NEWS

Leave a Comment