వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా మంగళవారం అంబర్ పేట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద రాష్ట్ర, నగర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, నాయకులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామ్ ఘర్ నగర్ బస్తీలో ఏర్పాటుచేసిన వినాయకునికి ఏపి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం బస్తీ వాసులు ఆమెను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంఘర్ నగర్ బస్తీ పెద్దలు, శ్రీ వినాయక నవ యువక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.