హన్మకొండ లోని బాలసముద్రం నవ్య శ్రీ మనోవికాస కేంద్రం మానసిక దివ్యాంగుల పాఠశాల లో గణేష్ నిమజ్జనం నేడు ఘనంగా జరిగింది. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పూజ అనంతరం నిమజ్జనం వేడుకలో పిల్లలతో సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్మషం ఎరుగని ఈ పిల్లలు చేసిన పూజ భగవంతుని కి చేరుతుందని అన్నారు. ఆ ఆశీర్వాదం పిల్లలకు, అందరికి దక్కుతుందని అన్నారు. వినాయకుని ప్రసాదం గా పెట్టి న లడ్డూ ప్రసాదం సంస్థ వారు ఆమెకు అందజేసారు. పిల్లలు పాటలు పాడుతూ గణనాథుడిని ఊరేగింపు గా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, నాగరాజు సిబ్బంది, పిల్లలు, టీచర్స్ పాల్గొన్నారు.