28.7 C
Hyderabad
April 20, 2024 07: 22 AM
Slider హైదరాబాద్

అంగరంగ వైభవంగా యువసేన గణనాథుని నిమజ్జన శోభాయాత్ర

#ganeshimmersion

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని టిఎస్ఐఐసి కాలనీలో యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుని నిమజ్జన శోభాయాత్ర సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. యువసేన యూత్ అసోసియేషన్ చైర్మన్, టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా ఇక్కడ సర్కిల్ పరిధిలోనే అతిపెద్దదైన  గణనాధుని విగ్రహాన్ని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. 14 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం ఏఎస్ రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జన శోభాయాత్ర బయలు దేరింది.

తొలుత వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య గణనాథుడి లడ్డూలను వేలం వేశారు. మేళతాళాలు, బాజా భజంత్రీలతో పాటు దేదీప్యమానమైన విద్యుత్ దీపాల మధ్య గణనాధుని నిమజ్జన ఊరేగింపు కొనసాగింది. చిత్ర, విచిత్ర వేషధారణలతో కళాకారులు చేసిన నృత్యాలు, ప్రదర్శనలు దారిపొడవునా భక్తులను ఆకట్టుకున్నాయి. నిమజ్జనాకి తరలి వెళ్తున్న యువసేన గణనాథుడు కాప్రా సర్కిల్ పరిధిలో అతి పెద్ద విగ్రహం కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి దర్శించుకున్నారు.

గణనాధుని విగ్రహం నిమజ్జన సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దీంతో టిఎస్ఐఐసి కాలనీ జన సందోహంతో కిటి కిటలాడింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాములు, నాయకులు నాను, రాము, రాజా, రఘు, మోహన్ రాజేష్, సాయి నాయుడు, తరుణ్, లలిత్, లలిత్, బాబ్జి, గణేష్, నాగబాబు, శివ, జి. కృష్ణ, పి. చక్రపాణి గౌడ్, రాకేష్, కె. నరేష్, భారత్ రెడ్డి, శ్రీకర్, రాంరెడ్డి, అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కరోనా బాధితులకు ఆహారం అందించిన మున్నూరు కాపులు

Satyam NEWS

పంజాబ్‎లో బొగ్గు కొరత.. తగ్గిపోయిన విద్యుత్ ఉత్పత్తి..

Sub Editor

నాగర్ కర్నూల్ జిల్లాలో మూడు కరోనా కేసులు

Satyam NEWS

Leave a Comment