కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సార్వజనిక్ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణనాథునికి బుధవారం రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
భాజా భజంత్రీల మధ్య నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా గ్రామ పెద్దల మధ్య పుర వీధుల గుండా సాగింది. కొన్ని చోట్ల బ్రిడ్జ్ మరమ్మతులు కొనసాగుతుండడంతో గణనాథున్ని భుజాలపై ఎత్తుకొని ముందుకు తీసుకువెళ్లారు. పురవీధుల గుండా నిమజ్జనానికి గణనాయకుడు కదలి వెళ్లాడు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, డాక్టర్ రాజు ,గాండ్లమహేష్, మైపతి హన్మాండ్లు ,రామ్మందిర్ గణేష్ మందిర్ చైర్మన్ బొమ్మల లక్ష్మణ్, గణేష్ గొండ, చేతన్ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.