ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన గణనాధునికి 5 వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం జరిగిన పూజా కార్యక్రమంలో రామంతపూర్ కార్పోరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు, హబ్సిగూడ కార్పోరేటర్ కక్కిరేణి చేతన హరీష్, ఉప్పల్ నియోజకవర్గం సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, మెడల మల్లిఖార్జున్ గౌడ్, సుధాకర్ రెడ్డి,సంజయ్ జైన్, ఎండీరఫీక్, వినోద్, ఆశు, గణేష్ నాయక్, శ్రావణ్ రెడ్డి సంతోష్, బొట్టు రాజేష్, ప్రెస్ క్లబ్ ప్రతినిధులతో కలిసి తెరాస నాయకులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కూకుట్ల నరోత్తం రెడ్డి, కార్యనిర్వాహణ అధ్యక్షులు వేముల తిరుపతి రెడ్డి,మాజీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మాదిరాజ్ సురేష్ కుమార్, పారెల్లి సాగర్, ఏవి శ్రీధర్, దాస్ రాజు,యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ వడ్డేపల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
previous post