యుఎస్,యూకే లాంటి విదేశాలకు కు వెళ్ళే గ్రాడ్యువేషన్ సర్టిఫికెట్ లేని వారి కోసం వీసాకు దరఖాస్తు చేయడానికి ఫేక్ సర్టిఫికెట్ లను అందిస్తున్నట్లు ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు చైతన్యపురి లో అరెస్ట్ చేశారు. దేశంలో పలు యూనివర్సిటీ ల ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ లను తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వీరి నుండి 12 యూనివర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్టీయూ,ఎన్ జి రంగా, ఆంధ్రా యూనివర్సిటీ,కాకతీయ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ,గుల్బర్గా యూనివర్సిటీ ఇలా ఒక్కో సర్టిఫికెట్ కు 50 నుండి 60 వేలు తీసుకుంటున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. కేసు ఇంకా విచారణలోఉందన్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గతంలో ఇలా ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసిన వారిపై పిడి యాక్ట్ లు కూడా నమోదు చేసినట్లు తెలిపారు.
previous post