ఆటోలో ఎక్కిన ఒక యువతిపై నలుగురు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో జరిగింది. కోఠీలో ఆటో ఎక్కిన ఒక యువతి జూబ్లీహిల్స్ కు వెళుతున్నది. కోటి వద్ద యువతిని అటో లో ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ మార్గమధ్యంలో తన స్నేహితులకు ఫోన్ చేశాడు.
జిల్లెలగూడ గాయత్రి నగర్ కు యువతి ని తీసుకెళ్లిన అటో డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతంలో యువతిపై అత్యాచారం చేశాడు. ఆటో డ్రైవర్ స్నేహితులు కూడా అక్కడకు చేరుకుని అత్యాచారం చేశారు. తేరుకున్న తరువాత ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేస్ నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధం ఉన్న నలుగురు యువకులను అరెస్టు చేశారు.