ఒంగోలు లో ఐదు నెలల కిందట జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటన మర్చిపోకముందే మరో సంఘటన అలాంటిదే జరిగింది. అయితే ఈ ఘటనలో బాధిత మహిళ వివరాలు తెలియలేదు. ఒంగోలు శివారు ప్రాంతమైన కేశవరాజు కుంట వద్ద ఓ మహిళ ఆపస్మారక స్థితిలో వివస్త్రగా పడివుండగా స్థానికులు గుర్తించారు. ఆమె పక్కన మహిళల లోదుస్తులు, కండోమ్స్, నల్లపూసల దండ పడివున్నాయి.
స్పృహలేని స్థితిలో గాయాలతో మహిళ పడివుండడంతో ఎవరో ఆమెపై అత్యాచారం చేసి వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వివస్త్రగా పడివున్న మహిళ పరిస్థితి చూస్తే గ్యాంగ్ రేప్ జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మహిళను ఆసుపత్రికి తరలించారు.