మహారాష్ట్రలో పూణెలోని విమన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఘోరం జరిగింది. ఉగాండాకు చెందిన ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో కొరెగావ్ పార్క్ సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్ బయట వాహనం కోసం ఎదురు చూస్తున్న బాధితురాలిని తన మోటర్ సైకిల్ పై లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు.
అతడి మాటలు నమ్మి బాధితురాలు బైక్ ఎక్కిన తర్వాత అతడు తన స్నేహితడికి ఫోన్ చేసి పిలిచాడు. తర్వాత వారిద్దరి మధ్యలో బాధితురాలిని కూర్చుబెట్టుకొని అక్కడ నుంచి కదిలారు. అయితే, తనను వేరే ప్రదేశానికి తీసుకెళ్తున్నారని గమనించిన బాధితురాలు బైక్ అపమని వారితో గొడవపడింది. అయినా వారు బైక్ ఆపకుండా నిర్మూనుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు.
అనంతరం బాధితురాలని అక్కడే వదిలేసి వెళ్తుండగా తనను మెయిన్ రోడ్డు వద్ద వదిలేయమని బాధితురాలు కోరడంతో నిందితులు రోడ్డు వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో కొందరు యువకులు కనిపించడంతో బాధితురాలు కేకలు వేసింది. దీంతో వారంతా బైక్ వైపు వెళ్లడంతో నిందితులు ఆమెను వదిలేసి పారిపోయారు.
తర్వాత బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు ఐపిసి 376 సెక్షన్ తెపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రెస్టారెంట్ వద్ద ఉన్న సిసిటివి ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.