39.2 C
Hyderabad
March 29, 2024 16: 12 PM
Slider ప్రకాశం

సుబ్బారావు గుప్తాపై తప్పుడు కేసు

#subbaraogupta

జెండాలు అమ్మే వ్యక్తికి గంజాయి అమ్మే వ్యక్తికి తేడా తెలియదా? ఒంగోలులో సోమిశెట్టి సుబ్బారావు గుప్తా పై తప్పుడు గంజాయి కేసు పెడతారా?అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరుపై నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఒంగోలులో మాజీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సుబ్బారావు గుప్తా పై గంజాయి కేసు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధింపుల కు పరాకాష్ట అని,గతంలో ప్రభుత్వం తన తప్పులు సరి చేసుకోవాలి అన్నందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అనుచరులు దాడిచేశారు అని, మునిసిపల్ చైర్మన్ తప్పుడు ఎస్సి కేసు గుప్తా పై పెట్టారని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. ఇది ఆర్యవైశ్య కులస్తులకు భయం కలిగించే చర్య అని తెలిపారు. సుబ్బారావు గుప్తా పై వేధింపులు ఆపాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలని, ఆయన పై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని నవతరంపార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు మంచివి కాదని,అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

అత్యంత వైభవంగా కేశవ స్వామి మాస కళ్యాణం

Satyam NEWS

సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు మరో ముగ్గురు పోలీసులపై కేసు

Satyam NEWS

సీఎం జగన్ పై రఘురాముడి నాలుగో అస్త్రం

Satyam NEWS

Leave a Comment