కడప జిల్లా రాజంపేట మండలంలోని బుధవారం కొత్త బోయినపల్లి లో మన్నూరు పోలీసులు 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులని,ఒక్క మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ మేరకు మన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మన్నూరు సి.ఐ.నరేంద్ర రెడ్డి,ఎస్సై రోషన్ లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
జిల్లా ఎస్పీ అన్బురాజాన్ ఆదేశాల మేరకు గతంలో గంజాయి విక్రయాలు జరిపిన చక్రంపేట, బోయినపల్లె లోని ఇండ్లపై తనిఖీలు చేసారు. ఇందులో బోయినపల్లె లోని తోడేటి శేఖర్ అతని భార్య రమాదేవి ఇంటి మిద్దె పై పెంచుతున్న గంజాయి మొక్కలను, ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
తోడేటి శేఖర్ 2002లో నెల్లూరు జిల్లా గూడూరులో ఓ హత్య కేసులో ముద్దాయి కాగా,2017 లో గంజాయి విక్రయం కేసులో మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్ పై విడుదల అయ్యి చిరు వ్యాపారం మొదలు పెట్టాడు.
ఆదాయం సరిపోక భార్య భార్యలు తిరిగి గంజాయి వ్యాపారం మొదలు పెట్టి,పోలీసులకు పట్టుపడ్డారు. వారితో పాటూ నందలూరు కు చెందిన గద్దె శివశంకర ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.