ఓడిషా రాష్ట్రం…సిమిలిగూడ…ఏపీలోని విజయనగరం జిల్లా కు చేరువ. ఆ సిటీ నుంచీ దాదాపు కోటిన్నర కు పైగా గంజాయి ఢిల్లీకి తరలిస్తున్నారు. నమ్మశక్యంగా లేదా….?..
సాక్షాత్తు డీఐజీ గా పదోన్నతి పై దిశ కు వెళుతున్న జిల్లా ఎస్పీ నోటివెంట వచ్చిన మాటలే. అయితే దీనికి వెనకాల డీఎస్పీ అనిల్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ మంగవేణి, ఎస్ఐ లు నారాయణ,అశోక్ ల చాకచక్య పని తీరు అమోఘన్నారు…ఎస్పీ రాజకుమారి.
ఈ మేరకు జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. వెహికిల్ చెకింగ్స్ లి భాగంగా విజయనగరం రురల్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది.
వాహనాల తనిఖీ నేపధ్యంలో విజయనగరం ఏజెన్సీ నుంచి విశాఖ వైపు వెళ్తున్న వాహనం పై అనుమానంతో తనిఖీలు చేపట్టారు.
అయితే అల్లం మాటున గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు.. పోలీసులు. వాహనంలో అల్లం కాకుండా 3 వేల కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
వాహనం తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నటు ఎస్పీ రాజకుమారి వెల్లడించారు.అయితే సిమిలిగూడలో గంజాయి లోడు చేసినట్టు నిందితులు పోలీసు ల విచారణ లో అంగీకరించారు.
కాగా సరుకు ఢిల్లీకి తరలిస్తున్నారని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.