గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఈరోజు ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేసి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఉద్దేశించి ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు మాదక ద్రవ్యాలకు బానిస ఐతే భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలియజేశారు.
ములుగు CI ఉత్తర్వుల మేరకు SI వెంకటాపూర్ పోలీసు సిబ్బంది నేటి ఉదయం వాహనాలు తనికి చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక సిమెంట్ కలర్ మారుతీ బెలోన కారు కనిపించింది. ఈ కారు పస్ర వైపు నుండి ములుగు వస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించింది. దాంతో ఎస్ ఇద్దరు వ్యక్తులను పట్టుకోగా ఒక వ్యక్తి పారిపోయాడు.