39.2 C
Hyderabad
March 29, 2024 14: 10 PM
Slider రంగారెడ్డి

గ్యాంగ్ లీడర్: విశాఖ నుంచి షిర్టీకి గంజాయి స్మగ్లింగ్

rachakonda police

నగర శివారులో ని ఘట్ కేసర్ లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు ను పోలీసులు రట్టు చేశారు. వంశీ నాయక్, రాజ్ నాయక్, రతన్ లాల్ ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. విశాఖపట్నంలో సేకరించిన గంజాయిని ఈ ముఠా వారు షిరిడి కి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

విశాఖపట్నం ధారకొండలో 2 వేలకు కిలో గంజాయిని కొనుగోలు చేసి వీరు హైదరాబాద్ లో 7 వేలకు విక్రయిస్తుంటారు. వివిధ పోలీసు స్టేషన్ లో ఈ నిందితులపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. పట్టుబడ్డ వారి వద్ద నుండి 51కేజీల గంజాయి, 5 వేల నగదు, కారు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు.

Related posts

వైద్య కాంట్రాక్ట్ సిబ్బందికి అలవెన్సులు ఇవ్వండి

Satyam NEWS

ట్రాక్టర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ల సమస్యలను పరిష్కరిస్తాం

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్‌?

Satyam NEWS

Leave a Comment