విజయనగరం జిల్లా గరివిడి మండలం తహసీల్దార్ కె. సుభాష్ బాబు కరోనా తో చికిత్స పొందుతూ మృతి చెందారు. కరోనా పాజిటీవ్ రావడంతో నెల్లిమర్ల కోవిడ్ ఆసుపత్రిలో చేరిన సుభాష్ బాబు దాదాపు 15 రోజుల పాటు కరోనాతో పోరాడారు.
చివరకు ఆయనకు శ్వాస సంబంధమైన ఇబ్బందులు రావడంతో తుది శ్వాస తీసుకున్నారు. విధి నిర్వహణలో ఎంతో చురుకుగా ఉండే సుభాష్ బాబు కరోనా తో అర్ధంతరంగా వెళ్లిపోవడం పట్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.