పవిత్ర గార్మి పండుగ సందర్భంగా వనపర్తి పట్టణంలోని రాజనగరం శివారులో మహబూబ్ సాని దర్గాలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం వనపర్తి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థించారు.
హిందూ ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రార్థించే మహబూబ్ సాని దర్గా సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి,
మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, యూసుఫ్ద ర్గా పీఠాధిపతి రహీం బాబా , మాజీ ఎంపీపీ సతీష్ కుమార్ రెడ్డి ,స్థానిక కౌన్సిలర్ అలివేల గోపాల్,ఎంపీపీలు మెగా రెడ్డి కృష్ణనాయక్, షేక్ జహంగీర్, (వనపర్తిజిల్లా వక్ఫ్ ఆస్తుల రక్షణ ,కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు) ,మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్,గొర్ల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్,టిఆర్ఎస్ నాయకులు పరంజ్యోతి శరవంద , బాల్ సామి రెడ్డి ,కర్ణాకర్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్